దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్ 19 వరకు పొడిగింపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్ ఈ నెల 19కి పొడిగిస్తూ విజయవాడ ఎసిబి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అధికారులు శాంతిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని, విజయవాడ, గుంటూరుల్లోని శాంతి ఇళ్లలో తనిఖీ చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేయగా కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది.  ఈ కేసులో ఎసిబి ఇప్పటికి శాంతిని రెండు పర్యాయాలు కస్టడీకి తీసుకుని విచారించింది. ఈ విచారణలో తన ఆస్తులు సక్రమమని వాదించినట్లు అధికారులు తెలిపారు. మరో పక్క శాంతి బెయిల్ పిటిషన్ ఇటీవల కోర్టు తిరస్కరించింది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default