తెలంగాణ-నార్వే ద్వైపాక్షిక సహకారంపై చర్చలు : మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల భేటీ


నార్వే ప్రతినిధులు మే ఎలిన్ స్టెనర్ నేతృత్వంలో హై లెవల్ డెలిగేషన్ సచివాలయంలో సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రితో వారు చర్చించారు. 'తెలంగాణ-నార్వే' ద్వైపాక్షిక సహకారంపై కీలక చర్చలు జరిగాయి. తెలంగాణలో పెట్టుబడులకు నార్వే కంపెనీలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం పలికారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో అనుకూల విధానాలు ఉన్నాయని తెలిపారు. క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో భాగస్వామ్యం అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఏఐ, క్లైమేట్ టెక్, హెల్త్ టెక్ రంగాల్లో కలసి పని చేసేందుకు రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. 'తెలంగాణ-నార్వే వర్కింగ్ గ్రూప్' ఏర్పాటు ప్రతిపాదనపై కూడా చర్చించారు. పెట్టుబడులకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి నార్వే సిద్ధమని రాయబారి వెల్లడించారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org