Ad Code

ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇళ్లపై ఏసీబీ దాడులు


ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ కలిగిరి శాంతి నివాసాలు, కార్యాలయాలపై మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తాడేపల్లి, విజయవాడలలోని శాంతికి చెందిన మూడు ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. కాగా, ఆమెకు విల్లాలు, ఫ్లాట్లు, కార్లు సహా రూ. 20 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నాయని, విశాఖలో భారీ భూదందాకు పాల్పడ్డారని గతంలో మంత్రి నారా లోకేష్‌కు శాంతి మాజీ భర్త మదన్ మోహన్ ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా అవినీతి నిరోధక శాఖ అధికారులు చేస్తున్న ఆకస్మిక దాడులు కలకలం రేపుతున్నాయి. వైసీపీ హయాంలో శాంతి వ్యవహారం తీవ్ర వివాదాస్పదమై, సస్పెన్షన్‌కు గురయ్యారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి, శాంతికి సంబంధం ఉందని మాజీ భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలుగులో రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu