ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైయస్సార్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తిరుపతి కోర్టు ఉద్యోగులు మృతి చెందగా, మరో నలుగురికి గాయపడ్డారు. మృతులు తిరుపతి కోర్టు జూనియర్ అసిస్టెంట్ యుగంధర్, ఫీల్డ్ అసిస్టెంట్ హరీష్ గా పోలీసులు గుర్తించారు. స్పీడ్ బ్రేకర్ వద్ద ముందున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఎడమవైపు ఉన్న లారీ టైర్లను కారు ఢీకొని ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
0 Comments