Ad Code

హంతకులను పట్టించిన పచ్చబొట్టు !


త్తరప్రదేశ్ లోని ఆగ్రా, సైయాన్ ప్రాంతంలో ఏప్రిల్ 1వ తేదీ రాత్రి సగం కాలిన స్థితిలో ఉన్న ఒక మృతదేహం లభ్యమైంది. ఇది స్థానికుల్లో తీవ్ర భయాందోళనలను కలిగించింది. మృతదేహం ముఖం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో గుర్తు పట్టడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే, మృతుడి ముంజేయిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అది లోకేంద్ర మృతదేహమని పోలీసులు గుర్తించారు. ఈ షాకింగ్ మర్డర్ కేసును ఛేదించడానికి పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో లభించిన సీసీటీవీ దృశ్యాలు, మద్యం సీసాలు మరియు కొన్ని కాగితపు ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా విచారణ జరపగా, లోకేంద్ర భార్య, ఆమె ప్రియుడు మహేష్ ప్రజాపతి, అతని స్నేహితుడు ధర్మవీర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో మహేష్ తన నేరాన్ని అంగీకరించాడు. లోకేంద్ర భార్యతో తనకు చాలా కాలంగా అక్రమ సంబంధం ఉందని తెలిపాడు. ఇటీవల వీరిద్దరి వ్యవహారం లోకేంద్రకు తెలియడంతో ఆయన తన భార్యను మందలించాడు. దీంతో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని వీరిద్దరూ పథకం రచించారు. లోకేంద్ర ఇంటి నుంచి బయటకు వెళ్లగానే, అతని భార్య ప్రియుడు మహేష్‌కు సమాచారం అందించింది. మహేష్, అతని స్నేహితుడు ధర్మవీర్ కలిసి లోకేంద్రను ఒక పొలానికి తీసుకెళ్లి మద్యం తాగించారు. అనంతరం లోకేంద్ర గొంతు నులిమి హత్య చేశారు. సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండేందుకు, శవంపై పెట్రోల్ పోసి, గోధుమ బస్తాలతో కప్పి నిప్పు పెట్టారని మహేష్ పోలీసులకు వివరించాడు. పోలీసులు నిందితుల ముగ్గురినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Post a Comment

0 Comments

Close Menu