బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ ఆటలు ఇక సాగవు!


శ్చిమ బెంగాల్‍లోని పురూలియాలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని మాట్లాడుతూ  బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ ఆటలు ఇక సాగవని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వారంతా ఈ నెల 29 లోగా పోలీస్ స్టేషన్‍లో లొంగిపోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని, ఆదివాసీల భూములను సిండికేట్లు ఆక్రమించుకున్నాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ 'కట్-మనీ' (కమీషన్) తీసుకుంటోందని ద్వజమెత్తారు. రాష్ట్రంలో ఉపాధి కొరత, పరిశ్రమల కొరతకు టీఎంసీనే కారణమన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలు టీఎంసీ సిండికేట్ గుప్పిట్లో ఉన్నాయని ప్రధాని అన్నారు. వ్యవసాయ మండీలు, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాల నియంత్రణను అధికార పార్టీ తమ 'సిండికేట్' సభ్యులకు అప్పగించిందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకిలించివేస్తామని ఆయన శపథం చేశారు. మమతా ప్రభుత్వం ఉపాధ్యాయ నియామక ప్రక్రియను దోచుకుందని, వేలాది మంది యువతను మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. 15 ఏళ్ల పాలనలో పశ్చిమ బెంగాల్‌లో నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరుకుందని టీఎంసీ మహా జంగల్ రాజ్ కారణంగా ఇది ఒక పెద్ద సంక్షోభం అన్నారు. నేను సాధారణంగా ఎన్నికల గురించి అంచనాలు వేయను, ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పను. కానీ ఈసారి, నేను కలిసిన ప్రతి ఒక్కరూ బీజేపీ ప్రభుత్వం ఖాయమని చెబుతున్నారన్నారు. ఈసారి బీజేపీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేశారు. టీఎంసీ ప్రభుత్వ పాలనలో బెంగాల్‌లో రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, పాఠశాలలు, ఆసుపత్రులు దయనీయ స్థితిలో ఉన్నాయన్నారు. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం