తమిళనాడులోని సేలంలో ప్రభుత్వ బస్సు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ స్థంభించకుండా పోలీసులు అవసరమైన చర్యలు తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments