Ad Code

ముగిసిన మాజీ డీజీపీ హెచ్ జే దొర అంత్యక్రియలు : పాడె మోసిన సీపీ సజ్జనార్


మాజీ డీజీపీ హెచ్ జే దొర అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. అధికార లాంఛనాలతో మాజీ డీజీపీకి అంతిమ వీడ్కోలు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు డీజీపీగా సేవలందించిన దొర అంత్యక్రియలు హైదరాబాదులో అశ్రునయనాల మధ్య నిర్వహించగా, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొని తమ నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. దొర స్వగృహం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీసీ సజ్జనార్, అవినాశ్ మహంతీ సహా అనేక మంది ఉన్నతాధికారులు హాజరై దొర కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ స్వయంగా దొర పాడె మోసి ఆయనకు చివరి నివాళి అర్పించడం అక్కడున్న వారిని కదిలించింది. అనంతరం మహా ప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించి దొరకు తుది వీడ్కోలు పలికారు.

Post a Comment

0 Comments

Close Menu