కర్ణాటకకు చెందిన ప్రవాస భారతీయుడు శాంతను షెట్టిగార్ అబుదాబిలోని బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో ధ20 మిలియన్లు (సుమారు రూ. 49 కోట్లు) గెలుచుకున్నారు. ఈ భారీ విజయంతో ఆయన స్వస్థలమైన ఉడిపిలో సంబరాలు మొదలయ్యాయి. మంగళవారం ఆన్ లైన్ లో ఈ లాటరీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఉడిపి జిల్లాలోని ఉద్యవర్కు చెందిన 33 ఏళ్ల శాంతను షెట్టిగర్ ఈ వారం అబుదాబిలో జరిగిన లైవ్ డ్రాలో జాక్ పాట్ ను దక్కించుకున్నారు. సిరీస్ 283, టికెట్ నంబర్ 305810తో కూడిన విజేత ఎంట్రీని టెలివిజన్ రాఫెల్ ఈవెంట్ లో ప్రకటించారు. ప్రస్తుతం ఒమన్లోని మస్కట్లో రిటైల్ రంగంలో పనిచేస్తున్న షెట్టిగర్, ఈ టికెట్ను ఒక స్నేహితుడితో కలిసి కొనుగోలు చేశారని నిర్వాహకులు తెలిపారు. బహుమతి ప్రకటించాక నిర్వాహకులతో మాట్లాడిన షెట్టిగర్, ఈ అనుకోని విజయం పట్ల ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేశారు. ప్రణాళిక ప్రకారం గెలుచుకున్న మొత్తాన్ని తన టికెట్ భాగస్వామితో పంచుకుంటానని తెలిపారు.
0 Comments