తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్లైన్ కరెంట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లను విడుదల చేసిన వెంటనే భక్తులు భారీగా టికెట్లను కొనుగోలు చేశారు. టికెట్లు విడుదలైన 7 నిముషాల్లో ఆన్లైన్ లో కొనుగోలు చేశారు. తక్కువ సమయంలోనే టికెట్లన్నీ అమ్ముడు పోవడంతో తిరుమల శ్రీవారి ఆలయం అదనంగా మరిన్ని టికెట్లను కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీవాణి దర్శన టికెట్ కొనుగోలుతో పాటు స్వామివారికి సుమారు 80 లక్షల రూపాయలు విరాళంగా భక్తులు సమర్పించారు.
0 Comments