ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల టెండర్ల ప్రక్రియపై అమరావతిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టెండర్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, బిడ్డర్స్ (టెండర్లో పాల్గొనే సంస్థలు)తో నేరుగా సంప్రదింపులు జరపాలన్న సూచన కూడా చేశారు. ఆదోని మెడికల్ కాలేజీ విషయంలో ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాలేజీ నిర్మాణం త్వరగా ప్రారంభమయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పీపీపీ విధానం విజయవంతంగా అమలులో ఉందని గుర్తుచేసిన చంద్రబాబు.. ఏపీలో కూడా మెడికల్ కాలేజీలను అదే విధానంలో నిర్మించి, ప్రజలకు భారంలేకుండా మెరుగైన వైద్య విద్య అందిస్తామని తెలిపారు. మెడికల్ కాలేజీల నిర్మాణం రాష్ట్ర అభివృద్ధిలో కీలకం. ఇందులో రాజీ లేదు. ఆలస్యం లేకుండా ముందుకు వెళ్లాలి అని సీఎం చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పారు. సీఎం వ్యాఖ్యలతో టెండర్ల ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.
0 Comments