కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న విశాల్ కి తెలుగులోనూ భారీగా అభిమానులున్నారు. గతేడాది రత్తం (తెలుగులో రత్నం) లో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. బాగా చిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రత్నం తర్వాత మరే లోనూ కనిపించలేదు. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని మదగజరాజ ఇప్పుడు థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా మదగజరాజ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో విశాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కు వచ్చిన విశాల్ ను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మోహం అంతా వాచిపోయి, మాట్లాతున్నప్పుడు చేతులు వణికిపోతూ, నోట్లోంచి మాట కూడా సరిగా రాలేని స్థితిలో ఉన్నాడు. విశాల్ పరిస్థితిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరోకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే విశాల్ తీవ్ర చలి జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని తెలుస్తోంది.
0 Comments