సంక్రాంతి పండుగ సందర్భంగా మరో 52 అదనపు రైళ్లను నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళంలకు నడుస్తాయని వెల్లడించింది. జనవరి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ 52 అదనపు రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎక్కువ సంఖ్యలో నివసిస్తుంటారు.
0 Comments