Ad Code

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం !


బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. క్రమంగా ఇది పశ్చిమవాయువ్య దిశగా కదులుతోందని, వచ్చే 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 11 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశముందని తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu