దేశంలోని అనేక ఆటోమొబైల్ కంపెనీలు వినియోగదారులకు ప్రత్యేక సంవత్సరం ముగింపు అమ్మకాలను అందిస్తున్నాయి. ఈ ఆఫర్లు కార్లు, బైకులు, స్కూటర్ల కొనుగోళ్లపై మంచి డిస్కౌంట్లు, క్యాష్ బాక్స్ ప్రయోజనాలు అందిస్తున్నాయి. టాటా మోటార్స్, మారుతి సుజుకి, హోండా, హ్యుండాయ్, మహీంద్రా, టీవీఎస్ లాంటి బ్రాండ్లు తమ ఎలక్ట్రిక్ వాహనాలపై వివిధ ఆఫర్లను ప్రకటించాయి. ఐక్యూబ్ మోడల్ ప్రస్తుతం రూ. 89,999 నుంచి ప్రారంభమై రూ. 1.85 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వరకు కొనసాగుతోంది. స్టాండర్డ్, ఎస్, ఎస్టీ వేరియంట్లలో వరుసగా 2.2 కిలోవాట్, 3.4 కిలోవాట్, 5.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్లు ఉన్నాయి. 2.2 కిలోవాట్ వేరియంట్ 75 కి.మీ రేంజ్, 5.1 కిలోవాట్ వేరియంట్ 150 కి.మీ రేంజ్ ఇస్తుంది. డిస్కౌంట్లు, ఫైనాన్స్ ఆఫర్లు, చెల్లింపు రాయితీలు వంటి ప్రయోజనాలు వినియోగదారులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. టీవీఎస్లో అధికంగా అమ్ముడయ్యే మోడల్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఫ్రీగా పొందే అవకాశం కల్పిస్తుంది ఆ కంపెనీ. అదేలా అంటే 'మిడ్నైట్ కార్నివాల్' పేరుతో సంస్థ డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటించింది. అది కుడా ఇయర్-ఎండ్ సేల్స్లో భాగంగా ఈ ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ డిసెంబర్ 12, ఆర్థరాత్రి 12:00 నుంచి మొదలయ్యి డిసెంబర్ 22, 2024 వరకు అంటే 10 రోజుల పాటు ఈ ఆఫర్ కొనసాగుతుంది. దీనితో యూజర్స్ అనేక ప్రయోజనాలు, డిస్కౌంట్లను పొందొచ్చు. అంతేకాకుండా వినియోగదారులు 100 శాతం క్యాష్బ్యాక్ను సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ మొదలయిన సమయం నుంచి ప్రతిరోజూ టీవీఎస్ స్కూటర్లు కొన్న వారిలో నుంచి రోజుకొకరిని ఎంపిక చేసి, వారికి స్కూటర్ని ఉచితంగా ఇస్తారు. డీలర్షిప్ ద్వారా ఈ-స్కూటర్ని కొనుగోలు చేయాలి. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని బుక్ చేసిన మిగతా వారికి ఐక్యూబ్ 3.4 కిలోవాట్లపై 5 సంవత్సరాలు / 70,000 కిలోమీటర్ల ఉచిత ఎక్స్టెండెడ్ వారంటీ, ఐక్యూబ్ 2.2 కిలోవాట్ల వేరియంట్లపై 5 సంవత్సరాలు / 50,000 కిలోమీటర్ల ఉచిత ఎక్స్టెండెడ్ వారంటీతో సహా రూ .30,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి.
0 Comments