బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండటంతో రాష్ట్రంలో బుధవారం ఉదయం నుండే చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. బలపడిన అల్పపీడనం తీరం వైపు కదులుతుండటంతో రానున్న ఐదు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురువనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి పశ్చిమ వాయవ్య దిశగా పయనించి బుధవారం శ్రీలంక, రాష్ట్రంలోని సముద్రతీరాల తీరాల వైపు కదులుతోందని, దీని ప్రభావంతో చెన్నైతోపాటు కడలూరు, మైలాడుదురై, నాగపట్టినం, తంజావూరు, తిరువారూరు, పుదుకోట జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. గురువారం శివగంగ, రామనాథపురం, శివగంగ, రామనాథపురం, తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు, కళ్ళకురిచ్చి, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం కారణంగా ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కడలూరు, మైలాడుదురై, నాగపట్టినం, తంజావూరు, తిరువారూరు, పుదుకోట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గురువారం డెల్టా జిల్లాల్లోనూ పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
0 Comments