తిరుమలలో డిసెంబర్ 3వ తేదీన స్థానికులకు శ్రీవారి దర్శనం ఉంటుందని టీటీడీ అధికారులు ప్రకటన చేశారు. ఈ మేరకు రేపు ఉదయం 5 గంటలకు దర్శన టోకెన్లు జారీ కానున్నాయి. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల పరిధిలో వున్న వారికి టిటిడి పాలక మండలి స్థానిక దర్శన టోకెన్లు జారీ చెయ్యనుంది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి మండలం, రేణిగుంట మండలం, తిరుమల వాసులకు టోకెన్లు జారీ చెయ్యనుంది టిటిడి పాలక మండలి. రేపు తిరుపతి మహతి వద్ద, తిరుమల కమ్యూనిటీ హాల్ వద్ద ఆధార్ కార్డు ఆధారంగా టోకెన్లు జారీ చేయనున్నారు.
0 Comments