హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను మార్చాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆయనకు న్యాయస్థానంలో ఊరట లభించగా, తదుపరి విచారణను నవంబర్ 3కి వాయిదా వేసింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించాలన్న సింగిల్ బెంచ్ ఆర్డర్ను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. తదుపరి విచారణ జరిగి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు లోతుకుంట భూముల జోలికి వెళ్లవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
0 Comments