Ad Code

శ్రీకాళహస్తిని సందర్శించి కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయాన్ని భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ గౌరవ కేంద్ర మంత్రి ఈరోజు సందర్శించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి దేవస్థానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ప్రోటోకాల్ ఏఈఓ లోకేష్ బాబు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. మంత్రి దర్శనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను దేవస్థానం అధికారులు సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, పర్యవేక్షకులు సి. నాగభూషణం యాదవ్, ఇన్‌స్పెక్టర్ ఎం. హరి యాదవ్, ఏపీఆర్‌ఓ ఆర్. సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, ఉప తహసీల్దార్ అనిల్, దేవస్థానం అధికారులు, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu