అమెరికాలో పిల్లలు, టీనేజర్ల సోషల్ మీడియా వినియోగంపై మెటా మరో పెద్ద న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటోంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ల రూపకల్పన పిల్లలను ఎక్కువసేపు యాప్లలోనే ఉంచేలా ఉందని ఆరోపిస్తూ నాలుగు అమెరికా రాష్ట్రాలు భారీ జరిమానా కోరాయి. ఈ డిమాండ్ మొత్తం 1.4 ట్రిలియన్ డాలర్ల వరకు ఉండటంతో కేసు ప్రపంచ టెక్ రంగం దృష్టిని ఆకర్షించింది. కాలిఫోర్నియా, కొలరాడో, కెంటుకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు దాఖలు చేసిన వ్యాజ్యంలో మెటాపై ప్రధాన ఆరోపణ యాప్ డిజైన్కు సంబంధించినది. ఎండ్లెస్ ఫీడ్, నోటిఫికేషన్లు, లైక్లు, రికమెండేషన్ వ్యవస్థలు పిల్లల దృష్టిని నిలిపివేయడానికి ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారని రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఈ కేసు ఆగస్టులో కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో విచారణకు రానుంది. ప్లాట్ఫారమ్లు పిల్లలకు సురక్షితమని మెటా బహిరంగంగా చెప్పినా, వాటి ప్రభావంపై సంస్థకు అంతర్గతంగా సమాచారం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వినియోగం వల్ల కొంతమంది పిల్లల్లో ఆందోళన, నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలు పెరిగాయని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. మరో 14 రాష్ట్రాలు కూడా విడివిడిగా చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ కేసు సాధారణ డేటా ప్రైవసీ వివాదం కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా కంపెనీలు తమ ఉత్పత్తులను ఎలా డిజైన్ చేస్తున్నాయి, చిన్నారుల భద్రతపై వాటి బాధ్యత ఎంత అనే ప్రశ్నలే ఇక్కడ కేంద్రబిందువుగా మారాయి. కోర్టు విచారణలో రాష్ట్రాలు తమ ఆరోపణలకు బలమైన ఆధారాలు చూపాల్సి ఉంటుంది.
0 Comments