Ad Code

కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు తొలి స్వర్ణం సాధించిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను

గ్లాస్కోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 48 కేజీల కేటగిరీ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి వరుసగా మూడోసారి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్ విభాగాల్లో కలిపి చాను మొత్తం 190 కేజీల బరువును ఎత్తారు. రెండో స్థానంలో నిలిచిన నైజీరియాకు చెందిన రూత్ నియోంగ్‌పై 22 కేజీల ఆధిక్యంతో ఆమె విజయం సాధించారు. చాను స్నాచ్ విభాగంలో తన మూడో ప్రయత్నంలో 85 కేజీలు ఎత్తి గేమ్స్ రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్‌లో 105 కేజీలు ఎత్తి మరొక గేమ్స్ రికార్డును సాధించారు. స్నాచ్‌లో ఆమె ఎత్తిన 85 కేజీల బరువు ఛాంపియన్‌షిప్ రికార్డు కాగా, ఆమె సాధించిన మొత్తం 190 కేజీల బరువు కూడా గేమ్స్ రికార్డుగా నమోదైంది. స్నాచ్ విభాగంలో మొదట 82 కేజీల తొలి ప్రయత్నంలో విఫలమైనప్పటికీ, రెండు మరియు మూడో ప్రయత్నాల్లో 85 కేజీల బరువును చాను విజయవంతంగా ఎత్తారు. క్లీన్ అండ్ జెర్క్‌లో 105 కేజీల తొలి ప్రయత్నం విఫలమైనప్పటికీ, ఆ తర్వాతి ప్రయత్నంలో మణిపూర్ కు చెందిన ఈ వెయిట్‌లిఫ్టర్ అదే బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని ముద్దాడారు. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో (48 కేజీల విభాగం), 2022 బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో (49 కేజీల విభాగం) స్వర్ణాలు సాధించిన తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో చానుకు ఇది వరుసగా మూడో పసిడి పతకం. భారత అథ్లెట్లు ఇదివరకే ఒక వెండి, ఒక కాంస్య పతకం సాధించగా, ఈ గ్లాస్గో ఈవెంట్‌లో భారత్‌కు లభించిన మొట్టమొదటి స్వర్ణ పతకం ఇదే.

Post a Comment

0 Comments

Close Menu