Ad Code

డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి : గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసిన బొత్స బృందం

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయ్యిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గురువారం బొత్స ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతల బృందం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ను కలిసింది. డీఎస్సీ సహా కీలక అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. డీఎస్సీపై సీబీఐతో విచారణ జరిపించాలి. ఐదు అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu