లెబనాన్లో రాత్రంతా కాల్పుల విరమణ కొనసాగడంతో పశ్చిమ ఆసియాలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. ఈ శాంతియుత వాతావరణం వచ్చే 48 గంటల తర్వాత కూడా ఇలాగే కొనసాగుతుందా అని ట్రేడర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇక్కడ పరిస్థితులు కుదుటపడితే భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరగడమే కాకుండా, విదేశాల్లో పనిచేస్తున్న మన భారతీయులకు భద్రత పెరుగుతుంది. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. నిలిచిపోయిన విమానాలను మళ్లీ ప్రారంభించేందుకు లేదా రీషెడ్యూల్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. గగనతలం సురక్షితంగా మారితే ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, విమాన టికెట్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ వార్తతో సరఫరా ఆందోళనలు కాస్త తగ్గడంతో, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. పశ్చిమ ఆసియాలో స్థిరత్వం ఉంటే డాలర్తో పోలిస్తే రూపాయి బలోపేతం అవుతుంది. ముడి చమురు ధరలు తగ్గితే భారత్ దిగుమతి బిల్లుల భారం తగ్గుతుంది. ఇది దేశవ్యాప్తంగా ఇంధన ధరల విషయంలో సామాన్యులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
0 Comments