Ad Code

రేపు పవన్ కళ్యాణ్ హన్మకొండ పర్యటన : ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్‌ ను పరామర్శించనున్న పవన్

తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్‌ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఇటీవల నిరంజన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు సమాచారం. బాలుడి పరిస్థితిపై ఆరా తీసిన ఆయన, స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు హన్మకొండలోని నిరంజన్ నివాసానికి చేరుకుని బాలుడిని పరామర్శించనున్నారు.పవన్ కళ్యాణ్ పర్యటన వార్త తెలియడంతో జనసేన కార్యకర్తలు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. బాలుడికి ధైర్యం చెప్పడంతో పాటు కుటుంబ సభ్యులకు అండగా నిలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu