సౌదీ అరేబియాలోని రాస్ తనూరా వద్ద జరిగిన అరామ్కో హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది సౌదీ జాతీయులు మరణించారు . అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల తర్వాత చమురు రవాణాను తిరిగి ప్రారంభించిన రెండు రోజులకే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 'సౌదీ అరామ్కోకు చెందిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం సుమారు 6:00 గంటలకు రాస్ తానూరాలో కూలిపోయిందని ఇంధన మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 14 మంది అమరులయ్యారు. వారందరూ సౌదీ జాతీయులే' అని ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని ఆ సంస్థ పేర్కొంది. 'హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడానికి, సంబంధిత అధికారుల సమక్షంలో దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. హర్మూజ్ జలసంధి తూర్పు-పశ్చిమ తీరంలో రాస్ తానూరా ఉంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు నిలిచిపోయిన కార్యకలాపాలను ఆరామ్కో గల్ఫ్లోని కీలకమైన రాస్ తానూరా టెర్మినల్లో శుక్రవారం పునఃప్రారంభించింది. కొన్ని గంటల వ్యవధిలో ఈ ప్రమాదం జరిగింది.
0 Comments