Ad Code

ఈడీ విచారణకు హాజరైన చెవిరెడ్డి భార్య, కుమారుడు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న 'లిక్కర్ స్కామ్' దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసుల నేపథ్యంలో మంగళవారం చెవిరెడ్డి భార్య, ఆయన కుమారుడు ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. మద్యం వ్యాపారాలు, లైసెన్సుల కేటాయింపు వ్యవహారంలో చెవిరెడ్డి భార్య పేరిట భారీగా అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. హవాలా మార్గాల ద్వారా కోట్ల రూపాయల మేర నిధులు చేతులు మారాయన్న ఆరోపణలపై వారిని విచారించినట్లు సమాచారం. ఈ స్కామ్‌తో మరికొందరు రాజకీయ ప్రముఖులు, అధికారులకు కూడా సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో.. తాజా ఈడీ విచారణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Post a Comment

0 Comments

Close Menu