ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో చర్చి పాస్టర్గా పనిచేస్తున్న చౌటపల్లి రాంబాబు (42), ఒక మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ క్రమంలో సదరు బాలిక గర్భవతి కావడంతో, విషయం బయటకు రాకుండా ఉండేందుకు ఆ పాస్టర్ చేసిన ప్రయత్నం బాలిక ప్రాణాల మీదకు తెచ్చింది. బాలిక గర్భం దాల్చిన విషయం తెలుసుకున్న పాస్టర్ రాంబాబు, ఆమెకు అధిక మోతాదులో గర్భనిరోధక మాత్రలు మింగించాడు. దీనివల్ల ఆ మైనర్ బాలికకు తీవ్ర రక్తస్రావం జరిగి ఆరోగ్యం క్షీణించింది. బాలిక పరిస్థితి విషమించడంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వెంటనే వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తక్షణమే స్పందించిన పోలీసులు నిందితుడు చౌటపల్లి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు ఇతర కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు, తీవ్ర అనారోగ్యానికి గురైన బాలికను మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
0 Comments