`దృశ్యం1', `దృశ్యం2' సినిమాల కొనసాగింపుగా మే 21న విడుదలైన దృశ్యం 3' నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా భారత్ లో రూ.105 కోట్ల గ్రాస్ రాబట్టింది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2,570 షోలు వేయగా, రూ.5.05 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఓవర్సీస్లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. పంచవ్యాప్తంగా రూ.113.75 కోట్లు వసూలు చేయగా, మొత్తం రూ.219 కోట్లకు పైగా రాబట్టింది. తాజా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మలయళ చిత్రాల్లో ఆరోస్థానంలో నిలిచింది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈసినిమాలో మోహన్ లాల్, మీనా కీలక పాత్రల్లో నటించారు. ద్వితీయార్ధం, ముఖ్యంగా చివరి గంట కథ, కథనాలను ఆసక్తికరంగా ఉండటంతో వసూళ్లు వర్షం కురుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
0 Comments