అదానీ గ్రూప్ పోర్ట్ఫోలియోలో భాగమైన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ మే 4న విడుదల చేసిన నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అసాధారణమైన వృద్ధిని కనబరిచింది. కేపిటల్ డిసిప్లిన్, ఆస్తుల గరిష్ట వినియోగం ద్వారా స్థిరమైన వృద్ధిని సాధించడమే లక్ష్యంగా కంపెనీ ముందుకు సాగుతోంది. 73.7 మిలియన్ టన్నుల సిమెంట్ను విక్రయించి రికార్డు సృష్టించింది. క్యూ4 లో 19.9 MnT విక్రయాలు జరిగాయి. కంపెనీ వార్షిక ఆదాయం రూ. 40,656 కోట్లకు చేరుకుంది. నాల్గవ త్రైమాసిక ఆదాయం రూ. 10,915 కోట్లుగా నమోదైంది. వార్షిక EBITDA రూ. 6,539 కోట్లుగా ఉండగా (గత ఏడాది కంటే 31% వృద్ధి), నాల్గవ త్రైమాసికంలో ఇది రూ. 1,464 కోట్లుగా ఉంది. సాధారణీకరించిన వార్షిక నికర లాభం రూ. 2,647 కోట్లు. కంపెనీ తన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి విలీనాలు , కొత్త ప్రాజెక్టులపై భారీగా పెట్టుబడి పెట్టింది. సాంఘీ, పెన్నా సిమెంట్ సంస్థల విలీనం విజయవంతంగా పూర్తయింది. ACC, ఓరియంట్ సిమెంట్ విలీనానికి సంబంధించి BSE, NSE లలో దరఖాస్తులు సమర్పించారు. ప్రస్తుతం SEBI నుండి అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. జోధ్పూర్లో 3 MTPA క్లింకరింగ్ లైన్ ప్రారంభించబడింది. దహేజ్ వద్ద 1.2 MTPA గ్రైండింగ్ యూనిట్ ట్రయల్ రన్ ప్రారంభమైంది.
0 Comments