Ad Code

మహారాష్ట్రలో కల్తీ మద్యం తాగి 12 మంది దుర్మరణం : ముగ్గురి పరిస్థితి విషమం


హారాష్ట్రలోని పూణే, పింప్రి-చించ్వాడ్ పరిసర ప్రాంతాలలో కల్తీ మద్యం తాగి గత రెండు రోజుల్లో కనీసం 12 మంది మరణించగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పింప్రి-చించ్వాడ్ పరిధిలోని ఫుగేవాడిలో ఏడుగురు, పుణెలోని హడప్సర్ ప్రాంతంలో ఐదుగురు ఈ విషపూరిత మద్యానికి బలయ్యారు. మరణించిన వారిలో ఫుగేవాడికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉండటం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నెట్టింది. హడప్సర్‌కు చెందిన రాహుల్ శరద్, విజయ్ శర్మ, అరుణ్ దాదర్, అశోక్ చవాన్‌లతో పాటు ఫుగేవాడికి చెందిన రాజేష్ రాజ్‌పుత్, పాండురంగ్ ఫుగే, ఆనంద్ దేశాయ్, అక్బర్ పఠాన్, ఆనంద్ నికాల్జే తదితరులు మృతుల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా ఈ మద్యంలో మిథనాల్ వంటి నకిలీ లేదా విషపూరిత పదార్థాలు కలిసి ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ, ఫోరెన్సిక్ మరియు టాక్సికాలజీ నివేదికలు వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు. పుణె, పింప్రి-చించ్వాడ్ పోలీస్ కమిషనర్లను సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. రంగంలోకి దిగిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ అక్రమ మద్యం సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో రెండు ప్రాంతాలకు కల్తీ మద్యాన్ని సరఫరా చేసిన ప్రధాన నిందితుడు యోగేష్ వాంఖడేను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకుని పింప్రి-చించ్వాడ్ పోలీసులకు అప్పగించారు. 

Post a Comment

0 Comments

Close Menu