Ad Code

ఓలా నుంచి S1 X+. 5.2 kWh ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల


దేశీయ మార్కెట్లో ఓలా కంపెనీ కి S1 X+. 5.2 kWh అనే మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ప్రవేశపెట్టింది. ఇందులో 5.2 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే 320 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది. గంటకు 125 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో దీనిపై దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు. ఈ బ్యాటరీ చార్జింగ్ కావడానికి ఆరు గంటల సమయం పడుతుంది. ఇందులో బ్యాటరీ వ్యవస్థ మాత్రమే కాకుండా యూత్ తో పాటు రోజువారీ ఉద్యోగులకు అనుగుణంగా ఫీచర్లు ఉన్నాయి. ఈ కొత్త స్కూటర్లో 7 అంగుళాల TFT కలర్ టచ్ స్క్రీన్ డిస్ప్లే కనిపిస్తుంది. ఇందులో నావిగేషన్ తో పాటు ఎస్ఎంఎస్ అలర్ట్, ఫోన్ కాల్స్ , రిమోట్ లాక్, టాకింగ్ వంటి ఫీచర్లో ఉన్నాయి. ఈ స్కూటర్లో ఇంటీరియర్ ఫీచర్స్ మాత్రమే కాకుండా దీని డిజైన్ కూడా వెరైటీ లుక్ తో ఆకర్షిస్తుంది. ఇప్పటివరకు ఎటువంటి స్కూటర్ కూడా ఇలాంటి మోడల్ డిజైన్ ను కలిగి ఉండలేదు. ఈ స్కూటర్ కు ఎల్ఈడి లైటింగ్, 12 అంగుళాల ట్యూబ్ లెస్ టైర్లు ఉన్నాయి. అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన బ్రేకింగ్ సిస్టం, డిస్క్ బ్రేకింగ్ వంటివి సౌకర్యాన్ని అందిస్తాయి. అలాగే ఇందులో రీ జనరేటు బ్రేకింగ్ బ్యాటరీని కూడా చేర్చారు. ఈ బ్యాటరీ త్రీ మోడ్స్ లో పనిచేస్తుంది. సేఫ్టీ కోసం ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఈ స్కూటర్ ను రూ.1.29 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu