Ad Code

ఇరాన్‌ సీజ్‌ఫైర్‌ కోసం మ​‍మ్మల్ని వేడుకుంది : అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌


రాన్‌ సీజ్‌ఫైర్‌ కోసం మ​‍మ్మల్ని వేడుకుందంటూ అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 శాతం లోపు ఆయుధాలను మాత్రమే వినియోగించామని, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని సహా కీలక మంత్రులు, మిలిటరీ అధికారులను అంతం చేశామని పేర్కొన్నారు. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాం. ఇరాన్‌ ఎప్పటీకీ అణ్వాయుధాలు కలిగి ఉండదు. ఇరాన్‌ న్యూక్లియర్‌ సెంటర్లను తొలగించేశాం. మా షరతులకు ఇరాన్‌ కట్టుబడి ఉంటుందని నమ్ముతున్నాం. ఒప్పందాలు చేసుకోవడంలో ట్రంప్‌ తర్వాతే ఎవరైనా. తీవ్ర ఒత్తిడికిలోనై ఇరాన్‌ కాల్పుల విరమణకు ఒప్పుకుంది. ఇరాన్‌కు క్షమాబిక్ష పెట్టాలని ట్రంప్‌ భావించారు. ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ గొప్ప విజయం సాధించిందని పీట్‌ హెగ్సెత్‌ పేర్కొన్నారు. మరో వైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో మరో సంచలన పోస్ట్‌ పెట్టారు. ఇరాన్‌కు ఆయుధాలిచ్చే దేశాలపై 50 శాతం టారిఫ్‌లు విధిస్తామని, టారిఫ్‌ల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవంటూ ట్రంప్‌ తేల్చి చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu