Ad Code

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ : స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్లు


మెజాన్, ఫ్లిప్‌కార్ట్ మధ్య సమ్మర్ సేల్ వార్ మొదలైంది. నేడు ఈ రెండు ప్లాట్‌ఫామ్స్ భారీ ధర తగ్గింపులతో కొత్త డీల్స్‌ను ప్రకటించాయి. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు లభిస్తున్నాయి. బ్యాంక్ ఆఫర్లను కూడా కలిపితే ధరలు ఇంకా తగ్గుతాయి. కస్టమర్ల కోసం రెండు సంస్థలు ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లను తీసుకొచ్చాయి. అమెజాన్‌లో ఎస్బీఐ, ఐసీఐసీఐ కార్డ్స్‌పై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్ హెచ్ డీ ఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్‌పై అదనపు ఆఫర్లు ఇస్తోంది. ఈఎంఐ లావాదేవీలకు కూడా ఈ తగ్గింపులు వర్తిస్తాయి, ఐఫోన్ 15, గెలాక్సీ S24 ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ అప్‌గ్రేడ్' పేరుతో 5G ఫోన్లపై డీల్స్ ఇస్తుంటే.. అమెజాన్ వన్‌ప్లస్ 12Rపై 'లైట్నింగ్ డీల్స్'ను ఆఫర్ చేస్తోంది. అమెజాన్‌లో డైకిన్, ఎల్‌జీ ఎయిర్ కండిషనర్లపై భారీ డిస్కౌంట్లు ఉండగా, ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ టీవీలపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో పోటీ పడుతోంది. బడ్జెట్ ఏసీలు ఇప్పుడు రూ. 35,000 లోపే అందుబాటులో ఉన్నాయి. స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ కోసం హెచ్‌పీ, యాపిల్ వంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ బోనస్, బ్యాంక్ ఆఫర్లను కలిపి వాడితే తక్కువ ధరకే వీటిని సొంతం చేసుకోవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu