Ad Code

మహిళా రిజర్వేషన్ బిల్లును మోడీనే చంపేశారు - తాము కేవలం డీలిమిటేషన్ బిల్లును మాత్రమే వ్యతిరేకించాం !


శ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్‌బిహార్‌లో జరిగిన సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే "చంపేశారని" తీవ్ర విమర్శలు చేశారు. 2029 నుండి మహిళా కోటాను అమలు చేయాలన్న బిల్లును కేంద్రం పక్కన పెట్టిందని, తాము కేవలం డీలిమిటేషన్ బిల్లును మాత్రమే వ్యతిరేకించామని, మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని ఖర్గే స్పష్టం చేశారు. మహిళల హక్కుల కోసం కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉందని, సరోజినీ నాయుడు, ఇందిరా గాంధీ వంటి మహిళా నేతలను అందించిన పార్టీ తమదని గుర్తు చేశారు. ఇదే సమయంలో, బెంగాల్‌లో ప్రధాని మోడీ విస్తృతంగా ప్రచారం చేయడాన్ని తప్పుబట్టిన ఖర్గే, ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉందా అని ఎద్దేవా చేశారు. 





Post a Comment

0 Comments

Close Menu