తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. నేటితో ప్రస్తుత విద్యా సంవత్సరం అధికారికంగా ముగియనుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి విరామం ప్రారంభంకానుంది. సాధారణంగా ఏప్రిల్ నెలాఖరు వరకు తరగతులు నిర్వహించేవారు, కానీ ఈసారి ఎండలు తీవ్రమవుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తుగానే సెలవులు ప్రకటించారు.
0 Comments