Ad Code

దేశం కోసం ప్రాణార్పణకు సిద్ధం !


రాన్ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఎక్స్ వేదికగా తెలిపారు. దేశానికి చెందిన కోట్లాది ప్రజలతో పాటు తానూ స్వచ్ఛందంగా ముందుకు వస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ దేశ భద్రతకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రయోజనాల కోసం ఎప్పుడూ నిలబడ్డానని, ఇక ముందు కూడా అదే విధంగా కొనసాగుతానని తెలిపారు. దేశ స్వాభిమానాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఆ దేశంలోని కీలక స్థావరాలు, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈసారి గడువు పొడిగింపు ఉండదని, తమ బలగాలు వేగంగా చర్యలు తీసుకోగలవని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదిస్తున్న తాత్కాలిక ఒప్పందాలను అంగీకరించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. తమ శాశ్వత డిమాండ్లు నెరవేర్చాలని మాత్రమే కోరుకుంటున్నామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు చేసిన తాజా ప్రకటనలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ అధ్యక్షుడి ధీటైన స్పందనతో అంతర్జాతీయ వేదికపై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ కోసం పలు దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నప్పటికీ, ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. పరిస్థితి మరింత విషమించే అవకాశాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu