Ad Code

మార్నింగ్ వాక్‌కి వెళ్లిన న్యాయవాదిని తుపాకీతో కాల్చి చంపిన దుండగులు


త్తర ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఓ న్యాయవాది దారుణంగా హత్య చేశారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు రాజీవ్ సింగ్‌ అనే న్యాయవాదిపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో రాజీవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఉదంతం అక్కడ ఉన్న సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. న్యాయవాది మృతి చెందాడని నిర్ధరించుకున్నాకే నిందితుడు అక్కడి నుంచి వెనుదిరిగాడు. మరో వ్యక్తి బైక్‌ స్టార్ట్‌ చేస్తుండగా అది మొరాయించింది. ఇద్దరూ దాన్ని స్టార్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు కొందరు వారిని పట్టుకోవడానికి పరిగెత్తారు. నిందితులు వాళ్లకి తుపాకీ చూపించి బెదిరించారు. ఈలోగా బండి స్టార్ట్‌ అవడంతో వారిద్దరూ ఘటనా స్థలం నుంచి పరారైనట్టు వీడియోలో కనపడుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu