ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి పట్ల భారత్ సంతాపం ప్రకటించింది. ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి వెళ్లిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భారత్ తరఫున సంతాప సందేశాన్ని రాశారు. అనంతరం ఇరాన్ రాయబారితో మిస్రీ మాట్లాడారు. ప్రస్తుతం ఇరాన్లో నెలకొన్న పరిస్థితులపై వారు చర్చించారు. ఫిబ్రవరి 28 శనివారం రోజున అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన 1989 నుండి ఇరాన్ అగ్ర రాజకీయ నేతగా, మత నాయకుడుగా కొనసాగుతున్నారు. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఖమేనీ సమూహం 30 క్షిపణులతో దెబ్బతింది. ఈ దాడిలో ఆయన భార్య మన్సౌరే ఖోజస్తే బఘెర్జాదే కూడా గాయపడి, చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడుల్లో ఖమేనీ కుటుంబ సభ్యులు పలువురు మరణించారు.
0 Comments