కర్ణాటకలోని మంగళూరు పోర్టుకు అపోలో ఓషియన్ పేరుగల నౌక 16000 మెట్రిక్ టన్నుల గ్యాస్తో వచ్చింది. ప్రస్తుతం ఆ నౌక నుంచి చమురు అన్లోడింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. కాగా ఇజ్రాయెల్, అమెరికా దేశాలు తమ దేశంపై దాడులు చేసినప్పటి నుంచి ఇరాన్ హర్మూజ్ జలసంధిపై పట్టు బిగించింది. ఇజ్రాయెల్, అమెరికా దేశాల నౌకలు జలసంధి దాటేందుకు ప్రయత్నిస్తే బాంబులతో పేల్చేస్తామని హెచ్చరించింది. అయితే భారత్ సహా కొన్ని దేశాలకు చెందిన నౌకలకు ఇరాన్ అనుమతి ఇచ్చింది. దాంతో భారత్కు చెందిన ముడిచమురు, ఎల్పీజీ నౌకలు హర్మూజ్ను దాటుకుని భారత్కు చేరుకుంటున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు అపోలో ఓషియన్ భారత్కు భారత్కు చేరుకుంది.
0 Comments