మహారాష్ట్ర నుంచి ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న రాందాస్ అథవాలే ను రాజ్యసభ బీజేపీ నామినేట్ చేసింది. అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేలతో పాటు మాయా చింతామన్ ఇవ్వనే, రామారావు వడ్కుటే పేర్లను పార్టీ ప్రకటించింది. పార్టీకి విధేయులుగా ఉంటూ సామాజిక సమీకరణాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేతలకు ఈ జాబితాలో ప్రాధాన్యత లభించింది. ఏప్రిల్లో ఖాళీ కానున్న ఈ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి.
0 Comments