తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ మైనింగ్ అక్రమాలపై చర్చకు అవకాశం ఇచ్చాం. మైనింగ్ అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించాం. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కై విచారణ సాగనీయడం లేదు. సీబీఐ విచారణకు ఇస్తే ఇప్పటివరకు చర్యలు లేవంటూ మండిపడ్డారు. సీబీఐకి కాళేశ్వరం కేసు అప్పగించాక బీఆర్ఎస్ -బీజేపీ ఒప్పదం చేసుకుంది. నిన్న సమగ్ర చర్చ తర్వాతే సీబీసీఐడీ ఎంక్వరీ ప్రకటన చేశాం. సీబీ సీఐడీ ఎంక్వరీ ప్రకటన తర్వాత బీఆర్ఎస్ సభ్యులే కేటీఆర్, హరీష్రావును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. హరీష్ రావు కుటుంబ సభ్యుల భూ దోపిడీ మీద హౌస్ కమిటీకి సిద్ధమా?. హరీష్కు నిజాయితీ ఉంటే హౌస్ కమిటీకి సహకరించాలి'' అని రేవంత్రెడ్డి అన్నారు.
0 Comments