వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని ప్రియుడితో కలిసి అత్తను చంపిన కోడలు


త్తరప్రదేశ్, లఖ్‌నవూలోని నిషాత్ గంజ్ ప్రాంతంలో త్రిదేశ్, రంజన దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి ముగ్గురు పిల్లలు, త్రిదేశ్ తల్లి నిర్మలాదేవి కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. వీరి భవనంపైన గదిలో రాజన్ అనే వ్యక్తి అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో రంజనకు, రాజన్‌కు పరిచయం ఏర్పడి. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. భర్త బయటకు వెళ్లగానే వీరిద్దరు కలుస్తూ ఉండే వారు. వీరి వ్యవహారం రంజన అత్త నిర్మలా దేవి గుర్తించింది. ఇలాంటి పనులు ఆపాలని కోడలిని ఆమె హెచ్చరించింది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న రంజన చంపేందుకు పథకం వేసి చీరతో నిర్మలా దేవి చేతులు, కాళ్లు కట్టేసి, గొంతు నులిమి ప్రియుడు రాజన్‌తో కలిసి రంజన చంసేంది. అనంతరం ఇంట్లోని బంగారు నగలు ప్రియుడికి ఇచ్చి ఈ హత్యను దొంగలు చేసినట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. గదిలో నానమ్మ మృతదేహాన్ని చూసిన త్రిదేశ్ పెద్ద కుమారుడు ఆదిత్య, తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకున్నారు. మృతురాలి కుమారుడు త్రిదేశ్ ఫిర్యాదు మేరకు రాజన్, రంజనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రాజన్‌తో కలవద్దని తరచూ తన అత్త చెప్పినందుకే హత్య చేసినట్లు కోడలు రంజన పోలీసుల విచారణలో అంగీకరించింది. పోలీసులు నిందితులను కోర్టులో హాజరు పర్చారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం