ఢిల్లీలోని భారత్ మండపంలో ఘనంగా ప్రారంభమైన 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026' వేడుకల్లో బాలకృష్ణకు ప్రతిష్టాత్మక 'లైఫ్టైమ్ అచీవ్మెంట్' (జీవితకాల సాఫల్య) పురస్కారాన్ని అందజేశారు. ఐదు దశాబ్దాలుగా సినిమా రంగానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ ఈ గౌరవంతో సత్కరించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ, హేమమాలిని, కంగనా రనౌత్, షర్మిలా ఠాగూర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ వేడుకలో బాలయ్యతో పాటు అలనాటి మేటి నటి షర్మిలా ఠాగూర్, దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్ర కుటుంబ సభ్యులు కూడా ఈ అవార్డును అందుకున్నారు.
0 Comments