Ad Code

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ !


ధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం సంప్రదాయ యుద్ధానికే పరిమితం కాకుండా, ఒక భయంకరమైన 'అణు విపత్తు'కు దారితీసే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్ఓ నివేదికల ప్రకారం, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అత్యంత వేగంగా విషమిస్తున్నాయని, అణు సదుపాయాలపై దాడులు జరిగే అత్యంత క్లిష్ట పరిస్థితులకు సిద్ధమవుతున్నామని సంస్థ ప్రకటించింది. తూర్పు మధ్యధరా ప్రాంతానికి చెందిన డబ్ల్యూహెచ్ఓ ప్రాంతీయ డైరెక్టర్ హనన్ బల్కీ ఈ ముప్పుపై స్పందిస్తూ దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించారు. ఒకవేళ అణు ప్రమాదం గనుక సంభవిస్తే, దాని పరిణామాలు కేవలం యుద్ధం జరుగుతున్న దేశాలకే పరిమితం కావని ఆమె స్పష్టం చేశారు. "మేము ఎంత సిద్ధమైనా, ఈ విపత్తు వల్ల కలిగే నష్టాన్ని పూర్తిగా నిరోధించడం ఎవరి వల్లా కాదు. ఇది సంభవిస్తే దాని ప్రభావం దశాబ్దాల పాటు ఉంటుంది. తరతరాల ఆరోగ్య వ్యవస్థపై, పర్యావరణంపై రేడియేషన్ కోలుకోలేని దెబ్బ తీస్తుంది" అని ఆమె హెచ్చరించారు. అణు ఆయుధాల వినియోగం, అణు కేంద్రాలపై దాడులు వంటి వినాశకర దృశ్యాలను ఊహించుకుంటూనే ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందాలు అత్యవసర ప్రోటోకాల్‌లను సమీక్షిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu