గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల ప్రకటన - చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్' రెండో ఎడిషన్ విజేతలను జ్యూరీ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది అవార్డుల్లో దిగ్గజ నటీనటులు, సాంకేతిక నిపుణులకు పెద్దపీట వేశారు. ఈ ఏడాది వివిధ విభాగాల్లో ఎంపికైన ప్రముఖుల జాబితాను ప్రకటించింది. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, అశ్వినీదత్ కు నాగిరెడ్డి- చక్రపాణి అవార్డు, సింగీతం శ్రీనివాసరావుకు బీఎన్‌రెడ్డి అవార్డు, కమల్‌హాసన్ కు పైడి జయరాజ్ అవార్డు, జయసుధకు అక్కినేని స్పెషల్ (ఫిమేల్) అవార్డు,సుద్దాల అశోక్ తేజకు సి. నారాయణ అవార్డు, రమేష్ ప్రసాద్ కు రఘపతి వెంకయ్య అవార్డు,ఆర్. నారాయణమూర్తి కి కాంతారావు అవార్డు. ఈ అవార్డులను మార్చి 19వ తేదీన ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించే వేడుకలో ప్రదానం చేయనున్నారు. సంగీత దర్శకుడు మణిశర్మ నేతృత్వంలోని జ్యూరీ, ఈ ఏడాది అవార్డులను ఎంపిక చేసింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org