ఆంధ్రప్రదేశ్ లో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. సముద్ర మట్టానికి సుమారు 0.9 కి.మీ ఎత్తులో గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుండి కోస్తా ఆంధ్ర వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం మరియు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని వాతావరణంలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి కోస్తా తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. నిన్న గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ నుండి రాయలసీమ వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీనపడింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా కింది స్థాయిలోని గాలులు ప్రధానంగా పొడి వాతావరణాన్ని మోసుకొస్తున్నాయి. వచ్చే మూడు రోజుల్లో రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఎండలతో పాటు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వేడి, అసౌకర్యమైన వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ సంచాలకులు తెలిపారు.
0 Comments