Ad Code

అసోంలో బీజేపీలోకి ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు


సోం అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అసోం బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ సైకియా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి గత నెలలో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు భూపేన్‌ కుమార్‌ బోరా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా పార్టీ మారిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఆ పార్టీ ఇటీవల సస్పెండ్‌ చేసింది. దాంతో వారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu