అసోం అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. అసోం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గత నెలలో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా పార్టీ మారిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ ఇటీవల సస్పెండ్ చేసింది. దాంతో వారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
0 Comments