ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాలవర్షాలు పడుతున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో వున్నట్లుండి వర్షాలు పడుతున్నాయి. అమరావతిలో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన కురిసింది. పిడుగుపడి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. విజయవాడ నగరంలో బుధవారం సాయంత్రం గం. 3.45 నిమిషాలకు ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం 5 గంటల వరకూ ఏకధాటిగా కురిసింది. నగరంలో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా వుండాలనీ, చెట్ల కిందకు వెళ్లవద్దని, రక్షణ షెల్టర్లలో మాత్రమే వుండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది.
0 Comments