బీహార్ రాష్ట్రం నలందలోని ప్రసిద్ధ శీతల మాత ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరికొంతమంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయ పరిసరాల్లో హాహాకారాలు మిన్నంటాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించే క్రమంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ సకాలంలో చేరుకోకపోవడం పట్ల బాధితుల బంధువులు మరియు భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అంబులెన్స్ త్వరగా వచ్చి ఉంటే మరికొందరి ప్రాణాలు కాపాడగలిగేవారమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
0 Comments