ఆర్థిక సేవల సంస్థ బ్లాక్ లో దాదాపు 4 వేల మందిని తొలగిస్తున్నట్లు టెక్ రంగ ప్రముఖుడు జాక్ డోర్సీ ప్రకటించాడు. సంస్థ లాభాల్లో వున్నప్పటికీ కేవలం సామర్ధాన్ని పెంచుకోవడానికే ఈ కఠిన నిర్ణయం తీకున్నట్లు తెలిపాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో తక్కువ మంది సిబ్బందితోనే ఎక్కువ పనిని పూర్తి చేయవచ్చని ఆయన బలంగా నమ్ముతున్నారు. ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి ఏఐ ప్రభావంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సాంకేతికత ధనికులను మరింత ధనవంతులుగా మారుస్తుందని, సామాన్య ఉద్యోగులు మాత్రం ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. కంపెనీ యజమానులు ఖర్చు తగ్గించుకుని లాభాలు గడిస్తారని, కానీ శ్రమపడే వర్గానికి ఇది గడ్డుకాలమని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిట్రిని రీసెర్చ్ నివేదిక ప్రకారం 2028 నాటికి ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. వేగంగా మారుతున్న సాంకేతికత వల్ల చాలా రంగాల్లో మానవ అవసరం తగ్గిపోతుందని ఈ సంస్థ అంచనా వేసింది. భవిష్యత్తులో ఈ మార్పులు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే ఆందోళన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది.
0 Comments